నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలంలోని 21 గ్రామపంచాయతీలలో నవంబర్ 30వ తేదీనే పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో శివప్రసాద్ వర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 30వ తేదీన ఈ కార్య క్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో ఆదేశించారు.