పుత్తూరు: భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం

82చూసినవారు
నగరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని చూడటానికి పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. వేదమంత్రాల నడుమ పండితులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్