నగిరి నియోజకవర్గం, వడమాల పేటలో రూ.5 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. అదేవిధంగా గత ఐదేళ్ల పాలనలో నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని ఎమ్మెల్యే తెలిపారు.