కీలపట్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం హనుమంత వాహనం మెరివిని అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రీయ యుక్తంగా వేద పండితుల సమక్షంలో జానపద కళాకారులతో, చెక్కభజనలు, కోలాటాలు, మేల వాయిద్యాలతో ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు జరిగింది. ఎందరో భక్తులు గోవింద నామాలతో పురవీధుల్లో సంచరిస్తూ భగవంతుని దర్శించుకుని తరించారు.