పలమనేరు మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి గురువారం కోరారు. ఎస్సీ కులానికి చెంది, 21 నుంచి 50 మధ్య వయసు ఉన్నవారు అర్హులని చెప్పారు. ఏపీఓబీఎంఎంఎస్ సైట్ ద్వారా మే 10వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.