పలమనేరు పట్టణంలో జాతర ఏర్పాట్లను సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజ శనివారం పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీధర్ నాయుడు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.