గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో కొలువైన కోనేటి రాయస్వామికి బ్రహ్మోత్సవాలులో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. 7 గంటల నుంచి గరుడ వాహనంపై కళ్యాణ వెంకటేశ్వరము మెరివిని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గోవింద నామాలు స్మరిస్తూ భక్తులు కోర్కెలు తీర్చే వెంకటేశ్వరుని గోవిందస్మరణతో గ్రామము మారు మ్రోగింది. సాంప్రదాయక నృత్యాలతో, జానపద కళాకారుల కోలాటాలతో అంగరంగ వైభవంగా గరుడ ఉత్సవం జరిగింది.