పలమనేరు: కార్యకర్తలకు ఎమ్మేల్యే అమర్నాథ్ కీలక ఆదేశాలు

66చూసినవారు
ప్రజా సమస్యలపై కార్యకర్తలు, నాయకులు దృష్టి సారించాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న అంశంపై నాయకులకు పూర్తి అవగాహన అవసరమన్నారు. ముఖ్యంగా రేషన్ పంపిణీలో ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తాగునీరు ఇబ్బందులు ఎక్కడైనా ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్