పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి బుధవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. ఎమ్మెల్యేగా అయితే తాను వున్నాను కానీ, గ్రామాలలో సర్పంచులు, స్థానిక సంస్థలు ప్రతిపక్ష పార్టీవి అన్నారు. కాబట్టి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ప్రజలకు అండగా ఉండాలన్నారు. ప్రజలకు ఏ విషయం అయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు.