పలమనేరులోని శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో శనివారం వేలం పాట నిర్వహించగా రూ. 2.29 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీధర్ నాయుడు, ఈఓ కమలాకర్ తెలిపారు. ఈ నెల 14 నుంచి 16 వరకు జరగనున్న జాతరలో అంగళ్ల ఏర్పాటుకు ఈ వేలంపాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.