గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు సీఐ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. పలమనేరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నానికి చెందిన కాశీనాథ్ ఎన్టీపీఎస్ యాక్ట్ కేసులో నిందితుడిగా ఉన్నారు. పరారీలో ఉన్న అతడిని కాణిపాకం క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడిని ఏడీజే చిత్తూరు వారి ముందు హాజరు పరిచి కస్టడీకి తరలించారు.