పీలేరు లోని సంత ఆవరణ వద్ద గల కరెంటు ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి ఓ గేదె మృతి చెందింది. మంగళవారం సమాచారం అందుకున్న పీలేరు ట్రాన్స్కో ఏఈ ఖాదర్ ఇలాహి వెంటనే ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మత్తులు చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న నీటి కుళాయి నుండి వస్తున్న నీటిలో కరెంటు ప్రసరించి గేదె చనిపోయిందని స్థానికులు తెలిపారు.