రామసముద్రం మండల పరిధిలోని గుండ్లపల్లి, గుంత యంబాడి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం పై శనివారం అటవీశాఖ అధికారి చిట్టిబాబు దండోరా వేయించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్ళరాదు అని హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు రెండు వేరువేరు ప్రాంతాలలో చిరుత కనపడిందని ఎఫ్బిఓ చిట్టిబాబు తెలిపారు.