అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ మాజీ ఎంపీపీ రహంతుల్లా బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవల ఆయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కలికిరి ప్రజలకు ఆయన మేస్త్రీ రహంతుల్లాగా సుపరిచితుడు. ఆయన మృతికి మైనారిటీ నేతలు, టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.