వ్యవసాయంలో నూతన పద్ధతులు పాటిస్తూ పీలేరు మండలాల్లోని 290 మంది రైతులు 235 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వైవీ రమణారావు అన్నారు. శుక్రవారం పీలేరు మండల సమాఖ్యలో వ్యవసాయశాఖ, డీఆర్డీఏ అధికారుల సమన్వయంతో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక 2025-26 పై రైతులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.