చిత్తూరు జిల్లాలో ర్యాష్ రైడింగ్ చిచ్చురేపింది. కేవీబీపురం మండలం పెరిందేశం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనాలను ర్యాష్గా నడపడంపై స్థానిక మహిళలు ప్రశ్నించారు. దీంతో వారి మధ్య మాట మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. యువకులు అక్కడి నుండి వెళ్లి తమ గ్రామం సుమారు 30మందిని తీసుకొనివచ్చారు. దీంతో రెండు గ్రామాలవారు కొట్లాటకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.