బంగారుపాలెం మండలం కేజీ సత్రానికి చెందిన హేమాద్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఇటీవల అతను మద్యానికి బానిసయ్యాడు. జీవితం పై విరక్తి చెంది తన ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందినట్లు బంగారుపాలెం ఏఎస్ఐ మల్లప్ప వెల్లడించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.