చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో రాష్ట్ర పుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మామిడికి ధరను అమలు చేయాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జెసి విద్యాధరి, గుజ్జు పరిశ్రమ యజమానులు తదితరులు పాల్గొన్నారు.