సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

67చూసినవారు
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ ధ్యేయమని అపార్టీ మండల ప్రధాన కార్యదర్శి మధుయాదవ్ ఆదివారం అన్నారు. పింఛన్లు పెంపుపై హర్షం వ్యక్తంచేస్తూ కూటమి నాయకులతో కలసి జొన్న గురుకుల గ్రామంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సప్తగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్