చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు వినాయకుడి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. ఆలయ ఈవో పెంచల కిశోర్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.