బంగారుపాలెం మండల పరిధిలోని నలగాంపల్లి ఫ్లై ఓవర్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను ఐచర్ వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు యాదమరి మండలం సీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన మణిరెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.