బంగారుపాళ్యం మండలంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగాంపల్లి ఫ్లైఓవర్ సమీపంలో ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపై పడిపోవగా, ఐచర్ వాహనం టైరు అతని తలపై నుంచి వెళ్తుంది. అతడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడు యాదమరి మండలం సీఆర్ కండ్రిగకు చెందిన మణి రెడ్డి.