స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భద్రతా చర్యలను పెంపొందించినట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ శుక్రవారం తెలిపారు. పాక్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆలయంలో పోలీసుల సమన్వయంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మెటల్ డిటెక్టర్లు, హోంగార్డులతో తరచూ తనిఖీలు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టామన్నారు.