టీడీపీ సభ్యత్వం ఒక కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. శనివారం బాలాయపల్లి మండలంలోని ఊట్లపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గోళ్ళ మహేష్ అనే వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద భీమా చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆయన టీడీపీ సభ్యత్వం ఉండటం వలన పార్టీ ద్వారా ప్రమాద భీమా మంజూరైందని ఎమ్మెల్యే తెలిపారు.