బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

52చూసినవారు
బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని భట్టువారిపల్లె సమీపంలోని ఆరన్నగారిబావిలో సోమవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ షేక్ షావలి తన సిబ్బంది మరియు వీఆర్వో మహబూబ్ బాషాతో కలిసి వెళ్లి మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీయించారు. వివరాలు తెలిసినవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

సంబంధిత పోస్ట్