పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలం, బొమ్మాయిపల్లి గ్రామంలో వున్న బ్రహ్మంగారి ఆలయంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 42వ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు విశేష పూజలు, అభిషేక హోమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. సాయంత్రం యువ ప్రవచన కర్త మద్దూరి ఆదిత్య శర్మ బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు బోధించారు.