పలమనేరులో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూర్ కోడ్ పోస్టర్లను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఆవిష్కరించారు. కులమతాలకు, రాజకీయాలతీతంగా త్రికరణ శుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందని కొనియాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.