పుంగునూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని రామసముద్రం మండలం చింతలపల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి మోసం చేశాడని బాధితురాలు శనివారం మీడియాకు తెలియజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరగలేదని వాపోయింది. పోలీసులు వెంటనే న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తుంది.