చిత్తూరు జిల్లా , పుంగనూరు మండలం కృష్ణాపురంలో గతంలో భూ వివాదం తలెత్తి ఘర్షణ పడ్డ ఘటనలో నిందితులపై పుంగనూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఆ కేసులో నిందితులు వేణుగోపాల్ , భరత్ ల ను ఆదివారం అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ఎస్పీ చెప్పారు.