చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగో రోజు అయిన గురువారం పట్టణంలోని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి సుబ్బరాజు మాట్లాడుతూ వేసవి కాలంలో పిల్లలు ఈతకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలిపారు.