చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో నుంచి తమిళనాడులోని తిరువన్నామలై గిరి ప్రదక్షనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పుంగనూరు ఆర్టీసీ డిపో ఆరు బస్సులను ఏర్పాటు చేసింది. డి ఎం సుధాకరయ్య పూజలు చేసిన అనంతరం శనివారం తిరువన్నామలై కు బయలుదేరాయి. ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షణ కోసం వెళ్లే భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడంతో బస్సులను ఏర్పాటు చేసినట్లు డిఎం తెలిపారు.