పుంగనూరు: చెరువుకట్టపై నుంచి జారిపడి భారీ ఏనుగు మృతి

405చూసినవారు
పుంగనూరు: చెరువుకట్టపై నుంచి జారిపడి భారీ ఏనుగు మృతి
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల(మం) పెద్ద ఒడ్డు సమీపంలో శనివారం తెల్లవారుజామున చెరువు కట్టపై నుంచి జారి పడి ఏనుగు మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయని, అనంతరం అర్ధరాత్రి కల్లూరు సమీపంలోకి ఏనుగుల గుంపు వచ్చిందని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్