ఏపీడబ్ల్యూజే ఎఫ్ జర్నలిస్ట్ సంఘానికి చెందిన పలువురు నాయకులు శుక్రవారం పుంగునూరు నియోజకవర్గ జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22 న చిత్తూరులో జరిగే ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలకు రావాలని వేణుగోపాల్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్ట్ సంఘ నాయకులు పాల్గొన్నారు.