పుంగనూరు నియోజక వర్గం, రొంపిచర్ల కేజీబీవీ విద్యార్థిని స్రవంతి ఇంటర్ లొ 965 మార్కులు సాధించింది. చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ లో స్రవంతి టాపర్ గా నిలవడంతో ఏపీ సన్షైన్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా మంగళవారం విజయవాడలో అవార్డు, మెడల్, ల్యాప్టాప్ అందుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్రవంతిని అభినందించారు.