పుంగనూరు ప్రవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న మహిమన్విత శక్తి స్వరూపిణి వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకారం గావించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి రాహుకాల పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.