చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణ సీఐగా గురువారం సాయంత్రం బి. సుబ్బారాయుడు బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ లో సీఐగా విధులు నిర్వహిస్తు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు పుంగనూరులో సీఐగా స్వీకరించారు. గతంలో సీఐగా శ్రీనివాసులును పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, అధికారులు, నాయకులు, ప్రజల సహకారంతో శాంతిభద్రతలను కాపాడుతానని తెలిపారు.