పుంగనూరు: ఇద్దరు మహిళలను ఢీకొన్న ప్రైవేటు పాఠశాల బస్సు

85చూసినవారు
పుంగనూరు: ఇద్దరు మహిళలను ఢీకొన్న ప్రైవేటు పాఠశాల బస్సు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని ఉలవదిన్నె గ్రామ సమీపంలో విశ్వభారతి ప్రైవేట్ పాఠశాల బస్సు గురువారం ఉదయం బోడేవారి పల్లికి చెందిన నీలావతమ్మ, భార్గవి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వారిని ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటీన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్