చిత్తూరు జిల్లా. పుంగనూరు మండల పరిధిలోని గుట్టపల్లి గ్రామానికి చెందిన బి. పవన్( 21) మనస్థాపం చెంది శుక్రవారం గ్రామ సమీపంలోకి వెళ్లి టమోటా పంటకు వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పవన్ ను హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు నిర్వహించి పవన్ పరిస్థితి విషమం ఉండడంతో తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తరలించారు.