పుంగనూరు: విద్యుత్ షాక్ తో యువకుడికి తీవ్ర గాయాలు

75చూసినవారు
పుంగనూరు: విద్యుత్ షాక్ తో యువకుడికి తీవ్ర గాయాలు
విద్యుత్ షాక్ తగలడంతో యువకుడు గాయపడిన ఘటన పుంగనూరు మండలంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు మండలంలోని మార్లపల్లి హంద్రీనీవా కాలువ సమీపంలో లారీలో జేసీబీని తరలిస్తుండగా విద్యుత్ తీగలు లారీకి తగలకుండా ఉత్తరప్రదేశ్ కు చెందిన హెల్పర్ విక్కీ కర్రతో వాటిని పైకి ఎత్తే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆయనకు షాక్ తగిలింది. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్