కాణిపాకంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. వరసిద్ధుడి దర్శనానికి బారులుదీరారు. దీంతో సర్వదర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ఆలయ అధికారులు పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.