నారాయణవనం: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ఊయల సేవ

85చూసినవారు
నారాయణవనం: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ఊయల సేవ
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి ఊయల సేవ వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి తిరుచ్చిపై కొలువుదీర్చారు.

సంబంధిత పోస్ట్