సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ ద్వారా 50% సబ్సిడీపై పశు దాణా బస్తాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, వెటర్నరీ ఏడీ ప్రసాద్ శుక్రవారం పంపిణీ చేశారు. ఇతర కులాలకు చెందిన దివ్యాంగులకు 50% సబ్సిడీపై దాణా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.