నాగలాపురం మండలంలోని నాగలాపురం, సుబ్బనాయుడు కండ్రిగ, బీరకుప్పం సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీ రమేశ్ చంద్ర, అసిస్టెంట్ ఇంజినీర్ పృధ్వి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.