పుత్తూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు గురు రామచంద్ర శర్మ పంచామృతాలతో అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించారు. నైవేద్యంగా పండ్లు, గరిక సమర్పించి పంచ హారతులు ఇచ్చారు. భక్తుల సమక్షంలో గణపతి మంత్ర జపం జరిగింది. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.