తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వరు విన్నవించారు. తుడా నిధులతో పిచ్చాటూరు ఆరణియార్ వద్ద నిర్మిస్తున్నన టూరిజం పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ. 40 లక్షలు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.