వరదయ్యపాళెం: పిట్టగోడ నిర్మించండి

79చూసినవారు
తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండలం కడూరు బ్రిడ్జి పిట్టగోడను ఇటీవల ఓ లారీ ఢీకొట్టింది. ఆ గోడ ధ్వంసమైంది. శ్రీకాళహస్తి-చెన్నై ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి పిట్టగోడ నిర్మించాలని శుక్రవారం ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్