వరదయ్యపాలెం: అప్రమత్తంగా ఉన్నాం: ఎంఆర్ఓ

59చూసినవారు
వరదయ్యపాలెం: అప్రమత్తంగా ఉన్నాం: ఎంఆర్ఓ
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం ఎమ్మార్వో రాజశేఖర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఫెంగల్ తుఫాన్ పట్ల రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు. ప్రజలకు నిత్యవసర వస్తువులు, సరుకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంటే వారిని పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్