రాకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి ఆలయంలోని పలు విభాగాలను శనివారం ఈవో బాపిరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. క్యూలైలను పరిశీలిస్తూ భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. వేగంగా భక్తులకు స్వామి అమ్మవారి దర్శనం అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదే విధంగా ఆలయంలోని నిత్య అన్నదాన పథకాన్ని పరిశీలించారు.