ఇంటర్ ఫలితాల్లో నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎంపీసీ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎం. నాగజ్యోతి 956/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిందని హెచ్ఎం కస్తూరయ్య తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీలో 32 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 27 మందికి గాను 25 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. శనివారం నాగజ్యోతిని పలువురు అభినందించారు