శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన బంకులకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు సీపీఐ నాయకులు గోపి, గురవయ్య బుధవారం వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ వద్ద ఉన్న బంకులను తొలగించి శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఇచ్చారు. 3 నెలలు అయినప్పటికీ కరెంట్, నీటి వసతి సదుపాయాలు లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోయారు.